Header Banner

ముంబయి ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..! కీలక ఫైళ్ల భద్రతపై సందేహాలు!

  Mon Apr 28, 2025 17:42        Politics

దక్షిణ ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీలకు సంబంధించిన కీలక దర్యాప్తు పత్రాలు కొన్ని దెబ్బతిని ఉండవచ్చని వార్తలు వెలువడ్డాయి. అయితే, దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం ఉండదని, అన్ని రికార్డులు డిజిటల్ రూపంలో భద్రంగా ఉన్నాయని ఈడీ సోమవారం స్పష్టం చేసింది. బల్లార్డ్ ఎస్టేట్‌లోని కైసర్-ఐ-హింద్ భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఈడీ ముంయి జోనల్ ఆఫీస్-1లో ఆదివారం తెల్లవారుజామున 2:25 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భద్రతా సిబ్బంది గమనించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. సుమారు 10 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

పత్రాలు కాలిపోవడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ఊహాగానాలను ఈడీ అధికారి ఒకరు తోసిపుచ్చారు. "దర్యాప్తునకు సంబంధించిన కీలకమైన ఆధారాలు, పత్రాలు అన్నీ డిజిటల్ రూపంలో, అలాగే అంతర్గత కేంద్రీకృత రికార్డు కీపింగ్ వ్యవస్థలో భద్రంగా ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేసిన కేసులకు సంబంధించిన అసలు పత్రాలు సంబంధిత కోర్టుల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, దర్యాప్తు లేదా విచారణకు ఎలాంటి ఆటంకం ఉండదు" అని ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగో అంతస్తులోని పవర్ బాక్సుల్లో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు అధికారి తెలిపారు. గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయని, అగ్నిప్రమాదం జరిగిన నాలుగో అంతస్తులోని కార్యాలయ విభాగాన్ని వెంటనే జన్మ్ భూమి ఛాంబర్స్‌లోని పాత ప్రాంతీయ కార్యాలయానికి మార్చి, కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.


ఇది కూడా చదవండిశుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #MumbaiFire #EDOfficeFire #ED #NiravModiCase #KeyDocuments #FireAccident #EnforcementDirectorate